ఈ మద్య టాలీవుడ్ లో పరభాష హీరోయిన్లు వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హోదాలో కొనసాగుతున్నారు.  ఇప్పటికే మాలీవుడ్ నుంచి కీర్తి సురేష్, సాయి పల్లవి..బాలీవుడ్ నుంచి రకూల్ ప్రీత్ సింగ్, మెహ్రీన్ కౌర్, రాశీఖన్నా ఇలా పవులురు హీరోయిన్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  ఇక ఛలో సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన కూడా వరుస విజయాలు అందుకుంటుంది.  గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ  కియారా అద్వానీ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. 
Related image
ఆ తర్వాత మరో టాప్ హీరో అయిన రాంచరణ్ సరసన  'వినయ విధేయ రామ' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతుంది. కాకపోతే  కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం కియారా కొన్ని బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి కరణ్ జోహార్ ఫిల్మ్.
Related image
బాలీవుడ్ లో ఆమెకి క్రేజ్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ క్రేజ్ ని దక్కించుకుంది. అయితే హీరోయిన్లు కొన్ని సినిమాలు సక్సెస్ అయితే కాని ఒక కోటి రెమ్యూనరేషన్ కి చేరుకోరు..కానీ ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ అప్పుడే ఒక్కో సినిమాకి దాదాపు రూ.1.25 కోట్లను డిమాండ్ చేస్తుందట. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.

ఈ మద్య గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే సినిమాలో హీరోయిన్ గా కియారాని తీసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఆమెను సంప్రదించగా..రూ.1.25 కోట్లు డిమాండ్ చేయడంతో దర్శక, నిర్మాతలకు మైండ్ బ్లాక్ అయ్యిందట..దాంతో వేరే హీరోయిన్ ని వెతుకుతున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: