డైరెక్టర్ క్రిష్ బాలయ్య కాంబోలో లేటెస్ట్ గా సంక్రాంతికి ఎంటీయార్ కధానాయకుడు మూవీ వచ్చ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓ మహా నటుడి జీవితాన్ని క్రిష్ బాగానే వెండి తెర మీదకు ఎక్కించాడని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సంక్రాంతికి కుటుంబ కధా చిత్రం అంటే ఇదేనని కూడా అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో మహా నాయకుడు మూవీ కూడా రోబోతోంది. మరి ఈ చిత్ర నిర్మాత కూడా అయిన బాలక్రిష్ణ క్రిష్ మీద ఏ అభిప్రాయంతో ఉన్నారన్నది ఆసక్తికరమే.


తన తండ్రి చిత్రాన్ని బాగ తెర మీదకు ఎక్కించిన క్రిష్ అంటే బాలయ్య బాగా అభిమానం చూపిసున్నారట. బాలయ్య బాబే స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మించారు. ‘‘కథానాయకుడు, మహానాయకుడు’’ అనే రెండు భాగాలుగా నిర్మిస్తూ.. దర్శకత్వ బాధ్యతలను క్రిష్‌కి అప్పగించారు బాలయ్య. అయితే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవటంతో చిత్రయూనిట్ అంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది.


కాగా.. ఇంతటి ఘన విజయం సాధించటంలో డైరెక్టర్ క్రిష్ చొరవే ఎక్కువగా ఉందని బాలయ్య అంటున్నారట. ఈ మేరకు అతనికి అదనపు పారితోషికం ఇచ్చేనందుకు బాలయ్య సిద్ధమయ్యారని తెలుస్తోంది. నిజానికి రెండు భాగాలకు కలిపి ఇదివరకే క్రిష్‌కి పారితోషికం అందిందట. కానీ షూటింగ్ సమయంలో క్రిష్ డెడికేషన్ చూసి ఇంప్రెస్స్ అయిన బాలకృష్ణ.. ఆయన్ను మరింత ఖుషీ చేసేందుకు బోనస్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. మొత్తం మీద క్రిష్ బాలయ్య అంటే హిట్ కాంబో అని ఈ మరో మారు రుజువు అయిందని అంటున్నారు. పైగా బాలయ్యను డైరెక్ట్ చేయడం క్రిష్ కే చెల్లిందని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: