గతేడాది సోషల్ మీడియా సంచలనంగా మారిన ప్రియా వారియర్ కు దివంగత నటి శ్రీదేవి భర్త లీగల్ నోటీసులు పంపడం హాట్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం ప్రియా వారియర్ ‘శ్రీదేవి బంగ్లా' అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే ఈ టీజర్లో చూపించిన సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. ఈమూవీలో ప్రియా వారియర్ శ్రీదేవి అనే ఫిల్మ్ స్టార్ పాత్రోలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో ఈ మూవీ హీరోయిన్ బాత్ టబ్ లో పడి చనిపోయినట్లు చూపించారు అని వార్తలు వస్తున్నాయి. దీనితో గత ఏడాది మరణించిన అతిలోక సుందరి శ్రీదేవి మరణ ఉదంతం ఈమూవీలో ఉంటుంది అన్న ప్రచారమం బాలీవుడ్ మీడియాలో మొదలైంది.
ఈవిషయాలు అన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ వరకు వెళ్ళడంతో ‘శ్రీదేవి బంగ్లా' దర్శక నిర్మాతలతో పాటు ఈమూవీలో నటించిన ప్రియ వారియర్ కు కూడా బోని కపూర్ లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. దీనితో ఈమూవీ శ్రీదేవి జీవితం ఆధారంగా నిర్మింప పడుతోందా అన్న అనుమానాలు బల పడుతున్నాయి.
అయితే ఈమూవీ దర్శకుడు ప్రశాంత్ మాంబల్లి ఈ లీగల్ నోటీసుల విషయాన్ని ధృవీకరించినా తమ సినిమా కధకు నటి శ్రీదేవి జీవితానికి ఎటువంటి సంబంధం లేదు అంటున్నాడు. ఒక నటి పాత్ర చుట్టూమాత్రమే తమ సినిమా ఉంటుందని శ్రీదేవి పేరు సినిమా టైటిల్ కు పెట్టినంత మాత్రాన అది శ్రీదేవి జీవితం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తూ తాము కోర్ట్ కేసులను ఎదుర్కొనడానికి సిద్ధం అని అంటున్నాడు. అయితే ఈ వ్యవహారం అంతా కేవలం ఈమూవీకి క్రేజ్ తప్పించడానికి ఇలాంటి సంచలనాలు సృష్టిస్తున్నారని అంటూ బాలీవుడ్ ప్రముఖులు ఈవిషయాన్ని తేలికచేసి మాట్లాడుతున్నారు..