సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కొంత కాలంగా ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు ఆయన సినిమాలతో సెన్సేషన్ సృష్టిస్తే..ఇప్పుడు తన ట్విట్స్ తో సోషల్ మీడియాలో ప్రకంపణలు సృష్టిస్తున్నారు.  ఆయన ట్విట్స్ కి సినీ, రాజకీయ,క్రీడా రంగమే కాదు కామన్ పీపుల్స్ కి కూడా వదలడం లేదు. అదే రేంజ్ లో వర్మ పై కూడా ఎన్నో విమర్శలు, సెటైర్లు వస్తున్న విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో కేఏ పాల్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నానని..తాను గెలవడం ఖాయమని రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తానని అన్నారు. 
Image result for ramgopal varma
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కేఏ పాల్‌పై సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ‘కేఏ పాల్ మోదీ, చంద్రబాబు వంటి చిన్న చిన్న లీడర్లపై పోటీ చేసేకంటే.. జీసస్‌ని ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి దానికి అధ్యక్షుడు అయిపోవచ్చు’అని ట్వీట్ చేశారు. దీనికి వెంటనే కేఏ పాల్ కౌంటర్ వేశారు. ఆర్జీవీ తనను ముంబై హోటల్‌లో కలిశారని.. తన కాళ్లు పట్టుకున్నారని వెల్లడిస్తూ ఓ ఫోటోను విడుదల చేశారు.   వావ్! ఆర్జీవీ ముంబై హోటల్‌లో నన్ను కలిసి నా పాదాలకు వినయపూర్వకంగా నమస్కారం చేశారు. తాను అలా తన గురువు దాసరిగారికి కూడా ఎప్పుడూ చేయలేదని చెప్పారు.
Related image
ఇది చూసిన జ్యోతి, వెంకట్ షాక్ అయ్యారు. నన్ను నా ఏపీ ప్రజలు నాలుగు నెలల్లో సీఎంని చేయగానే... మేము ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ అని నిరూపించుకుంటాం. అప్పుడు దేశం గురించి చూస్తాం అని ట్వీట్ చేశారు.  దీంతో రాంగోపాల్ వర్మ వెంటనే స్పందిస్తూ..ప్రభువా! నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగితే వెనక్కి పడి తన నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేశా అని కామెంట్ పోస్ట్ చేశారు. మొత్తానికి వీరిద్దరి మద్య సాగుతున్న ట్విట్ల వైరం సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: