ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ చెప్పుకోతగ్గ స్థాయిలో కమర్షియల్ సక్సస్ సాధించకపోయినా ఆసినిమా ఎందుకు ఫెయిల్ అయింది అంటూ ఇప్పటికీ మీడియాలో విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘కథానాయకుడు’ సినిమాలో సావిత్రికి సంబంధించి చూపించిన ఒక సీన్ సావిత్రి కుటుంబ సభ్యులకు అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
 తొలివారాంతంలో
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘కథానాయుకుడు’ మూవీలో సావిత్రి పాత్రను పోషించిన నిత్యామీనన్ కు అక్కినేని పాత్ర పోషించిన సుమంత్ క్లాస్ పీకినట్లు ఒక సీన్ క్రియేట్ చేసారు. అక్కినేని నాగేశ్వరావు ఇల్లుకోనడానికి సావిత్రి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చిన సంఘటనకు సంబంధించి చూపించిన ఆసీన్ లో అక్కినేని సావిత్రికి పెద్ద క్లాస్ పీకుతాడు.
నికర వసూళ్లు 16 కోట్లే
ఇప్పుడు ఆసీన్ విషయంలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి క్రిష్ తో తన అసహనాన్ని ఆసీన్ విషయంలో వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. అందరూ అనుకున్నట్లుగా తన తల్లి డబ్బు విలువ తెలియని వ్యక్తి కాదని అక్కినేని లాంటి వ్యక్తితో ఇంటి విషయమై బేరసారాలు ఆడటం ఇష్టం లేక అక్కినేని పై ఉన్న నమ్మకంతో అలా బ్లాంక్ చెక్ ఇచ్చిన విషయాన్ని మరో విధంగా చూపెడుతూ సావిత్రి వ్యక్తిత్వం పై తప్పుడు అభిప్రాయం వచ్చేలా సీన్ క్రియేట్ చేయడం తనకు నచ్చలేదు అంటూ ఆమె క్రిష్ వద్ద తన అసహనాన్ని వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది.
 70 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్
వాస్తవానికి ఎన్టీఆర్ జీవితంలో అనేక లోటుపాట్లు కూడ ఉన్నాయి. ఆ నెగిటివ్ విషయాలను ఏమీ చూపించకుండా కేవలం ఎన్టీఆర్ లోని అందరికీ తెలిసిన పాజిటివ్ అంశాలను హైలెట్ చేస్తూ కేవలం ఎన్టీఆర్ పాటలు సినిమాలకు సంబంధించిన సీన్స్ తో కథానాయకుడు నిండిపోవడంతో ఆమూవీ అటు మాస్ కు ఇటు క్లాస్ కు ఎవరికీ నచ్చని సినిమాగా మారింది. మహాభారతంలో కర్ణుడు మరణానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం అవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: