ప్రముఖ నటి అతిలోక సుందరి శ్రీదేవి భారతీయ చలన చిత్ర సీమలో ఎంతో పాపులారిటీ సంపాదించింది.  చిన్నతనంలోనే సినీ రంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి తెలుగు లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్రహీరోలతో నటించిన ఆమె తర్వాత తరం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా నటించింది.  బాలీవుడ్ లోకి వెళ్లిన శ్రీదేవి స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి దుబాయ్ లో అనూహ్యంగా మరణించిన విషయం తెలిసిందే.
Image result for boney kapoor sridevi
ప్రస్తుతం బయోపిక్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో ‘శ్రీదేవి ’బయోపిక్ తీయాలనే ఆలోచనలో బోనికపూర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  ఈలోగా  మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ప్రశాంత్ మాంబుల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శ్రీదేవి జీవితాధారంగా రూపొందించిన సినిమానా అనే సందేహాలు కలుగుతున్నాయి.  టీజర్ ఆఖరిలో శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోయిన సన్నివేశాన్ని చూపించడం, సినిమాలో హీరోయిన్ టాప్ హీరోయిన్ శ్రీదేవి పాత్రలో నటించడంతో ఈ అనుమానాలు మరింత పెరిగిపోయాయి.

దాంతో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌ చిత్ర యూనిట్ కి నోటీసులు కూడా పంపించారు.  తాజాగా ఈ వివాదంపై దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి మాట్లాడుతూ.. నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌టబ్‌లో పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని లేదు కదా? మమ్మల్ని సినిమా విడుదల చేసుకోనివ్వండి. బోనీ కపూర్‌ మాకు పంపిన నోటీసులను మేం ధైర్యంగా ఎదుర్కొంటాం అన్నారు. ఇక ఓ వ్యక్తి బయోపిక్ తీయాలంటే వారి సంబంధీకుల అనుమతి తీసుకోవాలన్న విషయం తమకు తెలుసని..ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. అలాంటప్పుడు సినిమాలోని సస్పెన్స్‌ గురించి ముందే చెప్పలేం. సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ కథ చెప్పుకొంటూ కూర్చోలేను అన్నారు.  మరి ఈ వివాదం ముందు ముందు ఎలా మారబోతుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: