తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  లంచం ఇవ్వడం తప్పే..లంచం తీసుకోవడం తప్పే అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం పెను సంచలనాలు సృష్టించింది.  చాలా కాలం తర్వాత ఈ చిత్రం సీక్వెల్ తీస్తున్నారు.  శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కమల్ హాసన్ ఆఖరి చిత్రం కావడం మరో విశేషం. 
Image result for indian 2 movie
ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ కూడా పెట్టుకున్నారు.  శంకర్  ‘2.ఒ’ తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే 'భారతీయుడు 2' సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తి చేసేశాడు. తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశారు. చెన్నైలో నేడు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును మొదలు పెడుతున్నారు.

కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో కమల్ సరసన కథానాయికగా కాజల్ కనిపించనుంది.  తమిళ హీరో శింబు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో శంకర్ వున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: