ఈ మద్య సెలబ్రెటీలు ఏ పని చేసినా అది సెన్సేషన్ అవడం..సోషల్ మీడియాలో వైరల్ కావడం జరుగుతుంది.   తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ తో కలసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సౌగతా రాయ్ స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  కోల్ కతాలో టీఎంసీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నటి రవీనా టాండన్ అక్కడికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.  సభ అంతా పాటలతో కోలాహలంగా మారింది.

గతంలో అక్షయ్ కుమార్ నటించిన ‘మెహ్రా’చిత్రంలోని  'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్'  హిట్ సాంగ్ పై రవినా డ్యాన్స్ చేయడం ప్రారంభించిన తనతో  కలసి డ్యాన్స్ చేయాలని సౌగతా రాయ్ ను రవీనా కోరింది. దాంతో సౌగతా రాయ్  ఆమెతో కలిసి స్టెప్పులు వేశారు. అదే సమయంలో తనతో కలిసి స్టెప్పులు వేయాలని వేదికపై ఉన్న ఇతర నేతలను కూడా రవీనా ఆహ్వానించింది.

ఈ సందర్బంగా రవీనా మాట్లాడుతూ..డెబ్బై ఏళ్ల వయసులో సౌగతా రాయ్ ఇంత ఉత్సాహంగా, జోష్ ఉన్న వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని తెలిపింది.  అంతే కాదు కేంద్ర మాజీ మంత్రి సౌగతా రాయ్ మంచి స్పోర్టివ్ పర్సన్ అని కితాబిచ్చింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: