సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం.. రాజకీయ నాయకులు అప్పడప్పుడు సినిమాల్లో నటించడం మామూలే. ఇప్పుడు నిత్యం ప్రజలతో మమేకమయ్యే ప్రజా నాయకుడు వైఎస్ జగన్ కూడా ముఖానికి రంగేసుకోబోతున్నారు. ఆయన త్వరలో ఓ సినిమాలో నటించబోతున్నారు.
ఐతే.. అది వేరే ఏ సినిమానో కాదు. తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న యాత్ర సినిమా. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక మలుపు గా చెప్పుకునే పాదయాత్ర ప్రధాన నేపథ్యంగా తెరకెక్కుతున్న సినిమా ఈ యాత్ర. ఇందులో వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహి.వి. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ నటించబోతున్నారు. జగన్ తన నిజజీవిత పాత్రనే ఇందులో పోషించబోతున్నారు. ఇది చాలా చిన్నపాత్రే అయినా సినిమాలో కీలకంగా ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఏపీలో ఎన్నికల సీజన్లో విడుదలకాబోతున్న ఈ యాత్ర సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.