టాప్ హీరోలు మహేష్ విజయ్ యష్ లను ఒక కథ కలపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు సుచిత్ర రావు అనే మహిళా రచయిత రాసిన కథ ఈముగ్గురు హీరోలకు నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మనదేశంలో అక్రమంగా కొనసాగుతున్న లక్షల కోట్లకు సంబంధించిన హైవే మాఫియాకు సంబంధించిన కథా వస్తువుతో ఈరచయత్రి రాసిన నవల మహేష్ విజయ్ యష్ లకు పూర్తిగా నచ్చడంతో ఒక ప్రముఖ తమిళ నిర్మాత ఈ ముగ్గురుతోను వారి వారి భాషలలో ఈ కథను సినిమాగా తీయడానికి ప్రాధమిక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అన్ని భాషల్లో
సుచిత్రా రావు 2017 లో ‘హైవే మాఫియా’ పేరుతో వ్రాసిన నవల పెను సంచలనం సృష్టించింది. ఈ నవలను దేశంలోని అన్ని భాషలలోకి అనువదించారు. లక్షల కాపీలు అమ్మకం జరిగిన ఈ పవర్ ఫుల్ స్టోరీని జనం మధ్యకు ఇంకా బాగా తీసుకువెళ్ళాలి అంటే సినిమా శక్తివంతమైన మాధ్యమం కాబట్టి ఈ నవలలోని విషయాలను యథాతధంగా తీయడానికి ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు టాక్. 
దర్శకుడి అభిప్రాయాలు
2004 నుంచి మనదేశంలో కొనసాగుతున్న పశువుల అక్రమరవాణా వెనుక ఉన్న ‘హైవే మాఫియా’ ను ఈ నవలలో సవివరంగా ఈ రచయిత్రి వ్రాసారు. ఈమధ్య కాలంలో వాస్తవ దృష్టితో కొనసాగే కథలు సినిమాలుగా వస్తే ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఈసామాజిక అంశంతో కూడిన ఈకథ సినిమాగా తీస్తే సంచలనాలు గ్యారెంటీ అని ఆప్రముఖ నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కథని సినిమాగా మలచగల దర్శకుడు కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ కథలో చాల వాస్తవ విషయాలు ఉండటంతో పాటు ఈ ‘హైవే మాఫియా’ వెనుక రాజకీయ నేతలు అధికారులు ఉండటంతో ఈ మాఫియా వల్ల అనేక హత్యలు కూడ జరుగుతున్నాయి. వాస్తవంతో కూడిన ఈ సున్నిత అంశాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి అంటే మహేష్ విజయ్ యష్ లు లాంటి స్టార్ హీరోలు నటిస్తేనే ఈసినిమా విజయం సాధిస్తుంది అని ఈ మూవీ నిర్మాత అభిప్రాయం. ఈకథ ఈ ముగ్గురు హీరోలకు నచ్చడంతో అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలోపున ఈమూవీ నిర్మాణం ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: