తెలుగు చిత్ర సీమలో చిరంజీవి ఇమేజ్ కి ఆకాశ‌మే హద్దు. ఆయన ఎపుడు ముఖానికి రంగు పూసుకున్నారన్నది చూడరు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అనుకుంటారు. అందుకు ఉదాహరణ ఆయన నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ. ఏకంగా వంద కోట్ల మార్క్ ని ఆ మూవీతో అవలీలగా చేదించిన మెగాస్టార్ ఇపుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని అందంగా చెక్కే పనుల్లో గత రెండేళ్ళుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


సైరా మూవీ తొందరలోనే ఫినిష్ చేసి కొత్త మూవీనీ పట్టాలెక్కించేందుకు మెగాస్టార్ రెడీ అయిపోతున్నారు. ఆ మూవీని ఈ సమ్మర్ లో స్టార్ట్ చేయాలని కూడా దిసైడ్ అయ్యారట. ఆ మూవీకి సంబంధిచిన అన్ని పనులనూ ఇపుడు డైరెక్టర్ కొరటాల శివ చకచకా కానిచేస్తున్నారు. రాం చరణ్ ప్రొడ్యూసర్ గా కొణిదెల బ్యానర్లో ఈమూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరా అన్న దానిపైన చాలా కాలంగా చర్చ సాగుతోంది. శ్రియ, త్రిష, అనుష్క లాంటి సీనియర్ భామల పేరులు వినిపించినా చివరికి నయనతారను కన్ ఫర్మ్ చేసారని టాక్ నడుస్తోంది.


సీనియర్ హీరోగా ఉన్న మెగాస్టార్ కి సరి జోడీ నయన్ అని డైరెక్టర్ తో పాటు, చిరంజీవి కూడా భావిస్తున్నారుట. సినిమాల్లోకి వచ్చి  దశాబ్దన్నర దాటినా నయన్ అందం చెక్కుచెదరలేదు. పైగా ఇమేజ్ సైతం తారస్థాయిలో ఉంది. ఆమె కోలీవుడ్ కి రాణి. అంతేకాదు,  టాలీవుడ్లోనూ ఆమెకు పెద్ద ఫ్యాన్ మెయిల్ ఉంది. అందువల్ల తనకు ఆమె సరైన హీరోయిన్ అని మెగాస్టార్ భావించడమే కాదు, ఓటేశారట. దాంతో నయన్ ని అప్రోచ్ అయిన కొరటాల ఆమె డేట్స్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సోషల్ మూవీలో మెగస్టార్ నయన్ తో చిందులేస్తారు. సైరా మూవీలో స్టెప్స్ అవకాశం లేనందున మెగా ఫ్యాన్స్ కోరిక ఈ విధంగా తీరనుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: