ప్రస్తుతం బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ క్విన్ కంగనా రౌనత్ హీరోయిన్ గా ‘మణికర్ణిక’సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో తెలుగు లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. క్రిష్ తర్వాత ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు హీరోయిన్ కంగనా రౌనత్ చేపట్టారు.
ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' సినిమా నిర్మితమైంది. క్రిష్, కంగనాలు సంయుక్తంగా దర్శకత్వంచిన ‘మణికర్ణిక’ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ వర్క్ లో కంగనా బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కంగనా హిమాచల్ ప్రదేశ్ .. 'మండి' జిల్లాలోని తన స్వస్థలమైన 'దాబోయి'లోని తమ కుల దేవతను దర్శించుకున్నారు. మహిషాసుర మర్ధిని దేవాలయాన్ని దర్శించుకుని .. ప్రత్యేక పూజలు చేయించారు.
తాను స్వయంగా కష్టపడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని మహిషాసుర మర్ధిని ఆశీస్సులు అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 180 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఆమె భావిస్తున్నారు.