మీడియా లో ఎప్పడూ అబ్బాయి కి ,  బాబాయ్ సంబంధించి వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ఎన్టీఆర్ కు బాలకృష్ణ కు మధ్య రిలేషన్ సరిగ్గా లేదని ఎప్పుడు మీడియా లో వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్...   అఖిల్ ఆడియో ఫంక్షన్ కు రావడంతో రచ్చ మొదలైంది . అక్కినేని నాగార్జున, బాలయ్యకు అస్సలు పడదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నాగార్జున తనయుడు అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాడు. తారక్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం బాలయ్యను కెలికేందుకే అంటున్నారు చాలామంది.

Image result for ntr and balakrishna

నాగార్జున అంటే బాలయ్యకు పడదనే విషయం తెలిసి కూడా అఖిల్ సినిమా ఫంక్షన్ కు ఎన్టీఆర్ కోరి వెళ్తున్నాడని అంటున్నారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్-కథానాయకుడు ప్రచారంలో కూడా సుమంత్ ను పట్టుకొని "ఎక్కడ మీ మామయ్య, నాగార్జున ఎక్కడ.. రమ్మను ఇక్కడికి" అంటూ సెటైర్లు వేశాడు బాలయ్య. ఆ టైమ్ లో అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు కూడా. కాకపోతే సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ ధాటికి తట్టుకోలేక ఊరుకున్నారు.

Image result for ntr and balakrishna

సరిగ్గా ఇలాంటి టైమ్ లో మిస్టర్ మజ్ను కోసం ముందుకొచ్చాడు తారక్. వచ్చిన వ్యక్తి ఊరుకోడు కదా, కచ్చితంగా వేదికపై నాగార్జునను పొగుడుతూ ఓ నాలుగు ముక్కలు మాట్లాడతాడు. ఇది చాలు బాలయ్యను గిచ్చడానికి. మరోవైపు ఈ వ్యవహారంతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నందమూరి అభిమానులు. ప్రముఖులంతా కథానాయుడు సినిమా బాగుందంటూ ట్వీట్లు చేస్తుంటే.. తారక్ ఇప్పటివరకు తాత బయోపిక్ పై స్పందించకపోవడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: