నిన్నరాత్రి జరిగిన ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం పై అఖిల్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తారక్ ఎనర్జీ చూసి తాను ఎన్టీఆర్ ను రియల్ లైఫ్ టైగర్ అని భావిస్తూ ఉంటానని అంటూ జూనియర్ ఎనర్జీ లెవెల్స్ గురించి పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు.
ఎస్ఎస్ తమన్‌కు సక్సెస్ లేకపోతే
అంతేకాదు జూనియర్ తమ కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తాడు అని చెపుతూ ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా రావడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలియచేసాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను ఈమధ్య ‘తారక్ గారు’ అని మెసేజ్’ పెడితే తారక్ ఆ మెసేజ్ పై స్పందిస్తూ ‘ఏరా బలిసిందా’ అంటూ రిటర్న్ మెసేజ్ పెట్టిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
వ్యాపారం తెలియదు.. అంతా వ్యామోహమే
అంతేకాదు ‘అన్నయ్య’ అని మాత్రమే తనను పిలవమని జూనియర్ కోరాడని అలా కాకుండా వేరే పిలుపుతో పిలిస్తే తనకు విపరీతమైన కోపం వస్తుందని అని అంటూ జూనియర్ తనకు ఇచ్చిన వార్నింగ్ ను బయటపెట్టాడు అఖిల్. ఈ సందర్భంలో అఖిల్ తన తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
గెస్ట్‌గా కాదు.. కుటుంబ సభ్యుడిగా
తన తండ్రి నాగార్జున తనతో ఒక తండ్రిలా కాకుండా ఒక గైడ్ గా ఒక పెద్దన్నలా తనకు సలహాలు ఇస్తూ తనను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటాడని తన తండ్రి ప్రోత్సాహం లేకుంటే తాను ఈసినిమాలో రంగంలో రాణించే అవకాశాలు వచ్చి ఉండేవి కావు అంటూ కృతజ్ఞతలు తెలియచేసాడు. జూనియర్ రాకతో మంచి సరదాగా జరిగిన ఈ ఫంక్షన్ జూనియర్ నాగార్జునల మధ్య కొనసాగుతున్న సాన్నిహిత్యానికి చిహ్నంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: