‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అఖిల్ జూనియర్ ల కుటుంబ బంధానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఫంక్షన్ లో జూనియర్ అఖిల్ వ్యక్తిత్వం పై కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. ప్రతి విషయంలోనూ తనకు తాను ఆత్మవిమర్శ చేసుకునే అఖిల్ కు ఉన్నంత ధైర్యం తమకు ఎవరికీ లేదని తన పొరపాట్లను తనకు తానే ఆత్మవిమర్శ చేసుకుంటూ అంగీకరించే అఖిల్ మనస్తత్వం తనకు కూడ లేదు అంటూ అఖిల్ కన్ఫ్యూజ్ మైండ్ పై అంతర్లీనంగా అఖిల్ ను పొగుడ్తూ మరొకవైపు చనువుగా సెటైర్లు వేసాడు.
గెస్ట్‌గా కాదు.. కుటుంబ సభ్యుడిగా
ఇదే సందర్భంలో జూనియర్ మాట్లాడుతూ పరాజయాలు ఒక మనిషిని ఎలా కృంగతీస్తాయో తనకు తెలుసని అంటూ కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొంతకాలం క్రితం పరాజయాలతో తెగ మధనపడిపోతున్నప్పుడు దేవుడా తమన్ కు ఒక హిట్ ఇవ్వు అంటూ తాను తమన్ కోసం భగవంతుడుని అడిగిన కోరికను వివరిస్తూ అంతర్లీనంగా తాను అఖిల్ హిట్ కోసం కూడ భగవంతుడుని కోరుకుంటున్నాను అనే సంకేతాలు ఇచ్చాడు జూనియర్.  
ఎస్ఎస్ తమన్‌కు సక్సెస్ లేకపోతే
ఇదే సందర్భంలో ఈమూవీ నిర్మాత భోగవిల్లి ప్రసాద్ గురించి మాట్లాడుతూ సినిమా రంగం పట్ల వ్యామోహం వేరు సక్సస్ వేరు అని వ్యాఖ్యానిస్తూ నిజాలను వెల్లడించాడు జూనియర్. నిర్మాత ప్రసాద్ కు సినిమా రంగం పట్ల విపరీతమైన వ్యామోహం ఉంది కానీ సక్సస్ ద్వారా డబులు చేసుకునే సమర్ధత లేదని అయితే ఆ అదృష్టం ‘మిష్టర్ మజ్ను’ మూవీ ద్వారా నిర్మాత ప్రసాద్ కు రాబోతున్నట్లు జోస్యం చెప్పాడు.
వెంకీపై అనుమానం ఏర్పడింది
ఇంతవరకు బాగానే ఉన్నా నిన్నటి ‘మిష్టర్ మజ్ను’ ఫంక్షన్ లో అందరికీ అభినందనలు తెలియచేయడానికి వచ్చిన జూనియర్ నోటి వెంట పరాజయాలు ఆత్మవిమర్శలు లాంటి సున్నిత అంశాలు జూనియర్ స్పీచ్ లో ఎందుకు వచ్చాయో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. దీనితో ఒక సినిమా గురించి విపరీతంగా పొగిడే కన్నా కొద్దిగా వాస్తవికంగా మాట్లాడితే ఆవిషయాలు అందరికీ కనెక్ట్ అవుతాయి అన్న ఉద్దేశ్యంతో జూనియర్ తన స్పీచ్ టెక్నిక్ ను మార్చాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: