ప్రభాస్‌ మూవీ ‘సాహో’ గురించి ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన మరో వార్త ప్రభాస్ అభిమానులకు విపరీతమైన జోష్ ను ఇస్తోంది. ఇంటర్నేషనల్ సింగర్స్ ‘బియాన్సే, జేజీ, మిస్సీ ఈలియట్‌’ పాడిన పాటలకు ఇంటర్నేషనల్ ద్యాన్సర్స్ లారెంట్‌ నికోలాస్‌, లారీ నికోలాస్‌ తో కలిసి ప్రభాస్‌ ఒక పాటలో డ్యాన్స్‌ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

లారెంట్‌ - నికోలాస్‌ కవలలు. వీళ్ల డ్యాన్సుకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. వీరి ప్రోగ్రాంలకు మిలియన్ డాలర్స్ లో కలక్షన్స్ వస్తూ ఉంటాయి. ‘సాహో’ సినిమాలో రాబోతున్న ఈసాంగ్ ఈసినిమాకు హైలెట్ గా మారబోతుందని అంటున్నారు. అంతేకాదు ఈ ఒక్క ఒక్క పాట కోసం సుమారు 5 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. 

ఈ పాట కోసం కనీవినీ ఎరుగని రీతిలో సెట్లు భారీ స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తునాట్లు వార్తలు వస్తున్నాయి. వందలాది మంది బ్రెజిల్ డ్యాన్సర్లు పాల్గొనే ఈసాంగ్ ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏటాప్ హీరో సినిమాలోను ఇప్పటివరకు లేని విధంగా చిత్రీకరించ బోతున్నట్లు సమాచారం. 

జాతర నేపథ్యంగా వచ్చే ఈసాంగ్‌ కు నేషనల్ అవార్డు విన్నర్ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ వైభవి మర్చెంట్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో ‘సాహో’ మూవీ పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈసినిమాకు కనీసం 500 కోట్ల బిజినెస్ చేయాలి అని పట్టుదలతో ప్రభాస్ ఉన్న నేపధ్యంలో ఇంత భారీ బిజినెస్ స్థాయిలో కలక్షన్స్ వచ్చేలా ‘సాహో’ ఉంటుందా అన్న భయాలు ఈమూవీ బయ్యర్లను వెంటాడుతున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: