బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. జనవరి 21, సోమవారం అంటే నిన్న సెకండ్ షెడ్యూల్ మొదలైన ఈ సినిమా హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా తెలియలేదు.


అయితే ఇప్పటికే హీరోయిన్స్ విషయంలో రాజమౌళి ఫైనల్ డెశిషన్ తీసుకున్నాడట. హీరోయిన్స్ తో డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయట. అఫిషియల్ గా చెప్పడమే లేటని తెలుస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న కీర్తి సురేష్, కియరా అద్వానిలనే రాజమౌళి సెలెక్ట్ చేశాడని తెలుస్తుంది.


అంతేకాదు సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ప్రియమణి కూడా ఆర్.ఆర్.ఆర్ లో నటించే ఛాన్స్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. హీరోయిన్స్ విషయంలో త్వరలో కన్ ఫ్యూజన్ కు తెర లేపుతారట ట్రిపుల్ ఆర్ యూనిట్. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుందట.


స్వాతంత్రం రాక ముందు కథతో ఇప్పటి జెనరేషన్ కథని లింక్ చేశారట. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ ట్రిపుల్ ఆర్ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారని తెలుస్తుండగా చరణ్ మాత్రం పవర్ ఫుల్ పోలీస్ గా చేస్తున్నాడని అంటున్నారు. ఇద్దరి స్టార్స్ మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: