తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు ఇంట్రడ్యూస్ అయ్యారు. కెరీర్ పరంగా ఎవరి టాలెంట్ వారు నిరూపించుకుంటూ మాస్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోలే కాదు హీరోయిన్ గా మెగా బ్రదర్ కొణిదెల నిహారిక కూడా తన సత్తా చాటుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇంట్రడ్యూస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వైష్ణవ్ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ చిత్రం లాంచింగ్ ఈవెంట్కు ఒకరిద్దరు తప్ప దాదాపు మెగా హీరోలంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కొణిదెల నిహారిక తదితరులంతా హాజరయ్యారు. ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు ఎంట్రీ ఇచ్చారు.
అయితే వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నా ఇది అతని మొదటి చిత్రం కాదు..గతంలో పవన్ కళ్యాన్ హీరోగా నటించిన ‘జానీ’చిత్రంలో చిన్నప్పటి పవన్ కళ్యాన్ పాత్రలో వైష్ణవ్ నటించారు..అందుకు మొదటి చెక్ నా నుంచే అందుకున్నాడు. అయితే ఈ సందర్భంగా నేను గర్వించే విషయం మరోకటి చెబుతున్నా..పవన్ కల్యాణ్ దగ్గర నుంచి బన్నీ.. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నలుగురినీ గీతా ఆర్ట్స్ ద్వారానే పరిచయం చేసిన ఘనత నాకే దక్కుతుందని అన్నారు అల్లు అరవింద్.