ప్రస్తుతం ‘సాహో’ కు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కు సంబంధించి ఎలాంటి లీకులు కానీ అలాగే ఎలాంటి ఫోటోలు కానీ బయటకు రావడానికి వీలులేదు అంటూ ప్రభాస్ తన యూనిట్ సభ్యులను కట్టడి చేస్తున్నాడు. 
అరుణ్ విజయ్ షేర్ చేసిన ఫొటో ఇదే
అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా తమిళ నటుడు అరుణ్ విజయ్ ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన వివరాలను షేర్ చేయడమే కాకుండా షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలను షోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభాస్ కు షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ తమిళ హీరో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. 
ప్రభాస్‌తో కలిసి అరుణ్ విజయ్
తమిళ నటుడు అరుణ్ విజయ్ హిందీ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ మలయాళ నటుడు లాల్ ప్రభాస్‌ కలవడంతో సెట్ అంతా ఫీల్‌ గుడ్ మూమెంట్స్‌తో సాగిపోతోందని అంటూ కొన్ని ఫోటోలు లీక్ చేసాడు. అంతేకాదు ఈమూవీ షూటింగ్ స్పాట్ లో తాను నటిస్తున్న ఇతర నటీనటుల పై ప్రశంసలు కురిపిస్తూ ‘సెట్స్‌ లో నీకంటే కూల్ పర్సన్ ఎవరుంటారు? ఇంత వరకు నేను చూడలేదు జాకీ ష్రాఫ్ సార్’ అంటూ అరుణ్ విజయ్ ట్వీట్‌ చేసాడు. అంతేకాదు ప్రభాస్ తో తాను స్వీటెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నానని అంటూ తన స్వీటెస్ట్ డార్లింగ్ ప్రభాస్ అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు. 
టాలీవుడ్‌కు తొలిసారి శ్రద్దాకపూర్
ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి నిర్మించిన ఒక భారీ సెట్ లో ఈమూవీ షూటింగ్ జరుగుతోంది. ఎట్టి పరిస్తుతులలోను ఈ మూవీ షూటింగ్ ను అనుకున్న విధంగా పూర్తి చేసి ఆగష్టు 15న విడుదల చేయాలి అన్న పట్టుదలతో దర్శకుడు సుజిత్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి షూట్ చేసిన యాక్షన్ సీన్స్ కు సంబంధించి భారీ గ్రాఫిక్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈమూవీతో ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: