తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి.  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటన ప్రదర్శించింది.  ఇక క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు.  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ‘యాత్ర’చిత్రం త్వరలో రిలీజ్ కాబోతుంది. 
Related image
ఇక కత్తి కాంతరావు బయోపిక్ కూడా సిద్దం చేస్తున్నారు.  తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు ఇటీవలే తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని  ప్రభాస్ తో, తన అభిమానులతో కలిసి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు రావడం పై స్పందించారు. 
Image result for prakash raj
తెలుగు లో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారని..అలాంటి వారిలో ఎస్వీ రంగారావు ఒకరని ఆయన బయోపిక్ చూడాలని ఉందన్నారు. మహానటి చిత్రాన్ని చూసినపుడు ఎంతో ఎంజాయ్ చేశానని సావిత్రి జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించడం కృష్ణం రాజుకి ఎంతో బాగా నచ్చిందన్నారు.  అయితే ఎస్వీ రంగారావు బయోపిక్ కూడా తెరకెక్కిస్తే..ఆ పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తే చాలా బాగుంటుందని అన్నారు.  కృష్ణం రాజు మాటలు బట్టి చూస్తే తన గోపి క్రిష్ణ బ్యానర్ లో కృష్ణం రాజే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేలాగా కనిపిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: