ఈవారం ఎటువంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ గా వస్తున్న అఖిల్ ‘మిస్టర్ మజ్ను’  అడ్వాన్స్ బుకింగ్ చాల ధియేటర్స్ కు సంబంధించి ఓపెన్ అయినా ఈవారం రిపబ్లిక్ డే లాంటి నేషనల్ హాలిడే ఉన్నప్పటికీ ఈమూవీ టిక్కెట్లు చాల నెమ్మదిగా బుక్ అవ్వుతూ ఉండటం చాలందిని ఆశ్చర్య పరుస్తోంది. సాధారణంగా వారసత్వ హీరోల సినిమాలకు సంబంధించి ఆమూవీ టాక్ తో సంబంధం లేకుండా మొదటిరోజు అన్ని షోలకు టిక్కెట్లు చాల స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. 

అయితే దీనికి భిన్నంగా రిపబ్లిక్ డే లాంటి నేషనల్ హాలిడేతో కూడిన వీకెండ్ కలిసి వచ్చిన్నప్పటికీ ‘మజ్ను’ టిక్కెట్లు ఆన్ లైన్ లో చాల స్లోగా బుక్ అవుతూ ఉండడంతో ‘మిష్టర్ మజ్ను’ పట్ల ప్రేక్షకులలో ఆసక్తి లేదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీకి ఏవిదంగా అయినా క్రేజ్ కలిగించాలని ఈమూవీకి యిస్తున్న మీడియా ఇంటర్వ్యూలలో నాగార్జున స్వయంగా అఖిల్ తో కలిపి పాల్గొనడం చాలామందికి ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. 

వాస్తవానికి ఈసినిమాను నాగార్జున నిర్మించక పోయినా కనీసం అతిథి పాత్రలో కూడ నాగార్జున నటించకపోయినా ఈమూవీకి సంబంధించిన ఛానల్స్ ఇంటర్వ్యూలలో నాగార్జున చాలా ఉత్సాహంగా అఖిల్ తో కలిసి పాల్గొంటూ అనేక విషయాలను షేర్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈఇంటర్వ్యూలలో మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు అఖిల్ కంటే నాగార్జున సమాధానాలు ఇస్తూ ఉండటంతో ఈమూవీ అఖిల్ నాగార్జునలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీనా అనే సందేహాలు కలగడం సహజం. 

దర్శకుడు వెంకీ అట్లూరి ఈమూవీకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈమూవీ కథ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ కధను పోలి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ‘మిస్టర్ మజ్ను’ కు విడుదల కాకుండానే ఎదురీత ప్రారంభం అయింది. ఇప్పటికే రెండు పరాజయాలు ఎదుర్కున్న అఖిల్ కెరియర్ కు ఈమూవీ కనీస విజయం అత్యంత ఆవశ్యకం..  


మరింత సమాచారం తెలుసుకోండి: