అఖిల్ కొత్త సినిమా Mr. మజ్ను రూపంలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే మజ్ను ఆడియో ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్ కార్యక్రంలో అఖిల్ తారక్ గురించి మాట్లాడినాడు. మిస్టర్ మజ్ను చిత్రం ప్రేమ కథ, కుటుంబ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని సమపాళ్లలో కుదిరిన చిత్రం అని అఖిల్ తెలిపాడు. చాలా రోజుల క్రితమే ఎంకి అట్లూరి మిస్టర్ మజ్ను కథ చెప్పాడు. వినగానే నచ్చింది. నా మూడవ చిత్రంగా దీనిని చేస్తానని అప్పుడే వెంకీకి చెప్పా అని అఖిల్ తెలిపాడు. 

ఎన్టీఆర్ మాటలు

అఖిల్ చిత్రం తర్వాత నాపై నేనే నమ్మకాన్ని కోల్పోయా అని అఖిల్ తెలిపాడు. కానీ ఆ తర్వాత చేసిన హలొ చిత్రం నిరాశపరిచినప్పటికీ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎలాంటి పాత్రలో అయినా నటించగలననే నమ్మకాన్ని, ఉత్సాహాన్ని హలొ చిత్రం అందించిందని అఖిల్ తెలిపాడు. ఇక మిస్టర్ మజ్ను చిత్రం ప్రెష్ గా ఉండే ప్రేమ కథ. అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలనీ ఉంది. నాది చిన్న వయసే కాబట్టి ఎక్కుగావా ప్రేమ కథలు చేస్తా అని అఖిల్ తెలిపాడు. 

కొత్త సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో

హలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఎన్టీఆర్ నా గురించి చెప్పినమాటలు ఆశ్చర్యకరంగా అనిపించాయి. నేను నా తప్పులు తీసుకుకుంటూ నటిస్తున్నాని ఎన్టీఆర్ తెలిపాడు. అది వాస్తవం. అఖిల్ చిత్రంలో చేసిన తప్పులని సరిచేసుకుని హలొ చిత్రంలో నటించా. నా నటన, హావభావాల విషయంలో నేను చేస్తున్న తప్పులని గమనించి సరిచేసుకుంటన్నా అని అఖిల్ తెలిపాడు. తన తదుపరి చిత్రాల కోసం కొన్ని కథలు వింటున్నా అని అఖిల్ తెలిపాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో కొన్ని కథలు వస్తున్నాయి. అంతా ఒకే అయ్యాక కొత్త సినిమా ప్రకటిస్తానని అఖిల్ తెలిపాడు. తనకు మల్టీస్టారర్ చిత్రాలపై కూడా ఆసక్తి ఉందని అఖిల్ తెలిపాడు. ఒకరిద్దరు కాకుండా ఐదారుగురు హీరోలు కలసి నటిస్తే బావుంటుందని తనకు అనిపిస్తోందని అఖిల్ తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: