తెలుగు సినిమా కళామతల్లికి రెండు కళ్ళుగా చెప్పుకునే అన్న నందమూరి, తమ్ముడు అక్కినేని కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. ఆ ఇద్దరు కలసి పదమూడు సినిమాల్లో నటించారు. అందులో చాలావరకూ హిట్లు ఉన్నాయి. ఇక ఇద్దరొ కూడా దశాబ్దాల పాటు వ్రుత్తిపరంగా పోటీ పడినా వ్యక్తిగతంగా మాత్రం మంచి సంబంధాలను కొనసాగించారు. వారిద్దరి స్నేహాన్ని ఇప్పటికీ ఆదర్శంగా చూపిస్తారు.


అటువంటి ఆ ఇద్దరి నట వారసులుగా వచ్చిన బాల‌క్రిష్ణ, నాగార్జునల మధ్యన మాత్రం అటువంటి స్నెహపూరితమైన వాతావరణం లేదని టాక్. నాగ్, బాలయ్యల మధ్యన మాటలు కూడా లేని రోజులు ఉన్నాయని అంటారు. ఈ ఇద్దరికీ ఎక్కడ చెడిందన్న దానిపైన కూడా సరైన‌ క్లారిటీ లేకపోయినా రిలేషన్లు మాత్రం అంతగా లేవు అన్నది వాస్తవం అంటారు. 


ఇక నాగ్ రెండో తనయుడు అఖిల్ న్యూ మూవీ మిష్టర్ మజ్ఞూ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్యతో విభేదాలు ఉన్నాయని చెబుతున్న జూనియర్ ఎంటీయార్ వచ్చాడు. ఇక నాగ్ సైతం బాలయ్య వూసు ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. మజ్ఞూ ప్రమోషన్లో భాగంగా అక్కినేని మీద బయోపిక్ తీస్తారా అని మీడియా అడిగినపుడు నాగ్ లేదని చెప్పడమే కాదు. అది డిజాస్టర్ అయితే తాము తట్టుకోలేమని చెప్పడం ద్వారా బాలయ్య మీద డైరెక్ట్ అటాక్ చేశాడని ఇపుడు న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య తన తండ్రి మీద తీసిన మూవీ డిజాస్టర్ అయిందన్నది నాగ్ ఇలా ఎత్తి చూపాడని అంటున్నారు. మొత్తానికి నాగ్ బాలయ్య మీద తన సెటైర్లను ఇంకా కొనసాగిస్తునాడు అంటే వీరిద్దరూ వేరుగానే ఉంటునారని అర్ధమని టాలీవుడ్ కోడై కూస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: