తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ ప్రోడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం స్టార్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వం..స్టార్ హీరోయిన్ సమంత..విలక్షణ నడుటు ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ కావడంతో ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఏ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. గతేడాది తమిళంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం ‘రాక్షసన్’.
తాజాగా రాంకుమార్ దర్శకత్వంలో విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తమిళంలో విష్ణు విశాల్ .. అమలా పాల్ జంటగా ఈ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రం హిట్ కొట్టేయడమే కాదు .. వైవిధ్యభరితమైన చిత్రంగా మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తెలుగు రిమేక్ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారని, రమేష్వర్మ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. గతంలో 'వీర' , 'రైడ్' చిత్రాలు వచ్చాయి. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ నటనను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.