సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి భానుప్రియపై సామర్ల కోట పోలీస్టేషన్ లో ఫిర్యాదు నమోదు కావడం వైరల్ గా మారింది. ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏడాది క్రితం 14 ఏళ్ల సంధ్య అనే తన కుమార్తెను చెన్నైలో ఉన్న భానుప్రియ ఇంట్లో పనికి పంపించామని... అప్పటి నుంచి తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారని సామర్లకోట మండలానికి చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Bhanupriya Denied Allegations On Her - Sakshi

ఏడాది కాలంగా తన కుమార్తెను ఇంటికి పంపడం లేదని, ఫోన్ లో మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. భానుప్రియ అన్న తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఆరోపించింది. గట్టిగా మాట్లాడితే తన కూతురుపై చోరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపింది.  ఈ కారణంతో  భానుప్రియ, అతని సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఫిర్యాదుపై సినీనటి భానుప్రియ స్పందించారు.


తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, సంధ్య అనే బాలిక సంవత్సరం నుంచి పనిచేస్తుందని ఆమె తెలిపారు.  ఇంట్లో పనిమనిషిగా ఉన్న సంధ్య తమ ఇంట్లో వస్తువులను చోరీ చేసినట్టు భానుప్రియ తెలిపారు. తొలుత నిజం చెప్పలేదని, నిలదీసి అడిగితే నిజం చెప్పిందని తెలిపారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లమని వాళ్ల అమ్మకు ఫోన్ చేశామని.. బాలిక దొంగిలించిన కొన్ని వస్తువులను ఆమె తిరిగి తీసుకొచ్చిందని భానుప్రియ చెప్పారు. మిగిలిన వస్తువులను తీసుకొస్తామని ఇంటికి వెళ్లిన బాలిక తల్లి చివరికి తమ పైనే కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.  తమ ఇంట్లో వస్తువులను చోరీ చేసినందుకు సంధ్యపై చెన్నైలో కేసు నమోదు చేయనున్నట్టు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: