ఈమధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతు ఉండటంతో ఆమూవీకి కలక్షన్స్ బాగా వచ్చినా బయ్యర్లు నష్టపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. దీనితో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు మాత్రమే బయ్యర్లు లాభపడే పరిస్థుతులు ఏర్పడుతున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో టాప్ హీరో నటించిన ప్రతి హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వదు కాబట్టి ఆసినిమాలో బడ్జెట్ విషయంలో పొదుపు పాటించమని టాప్ హీరోలు నిర్మాతలకు సూచిస్తున్నారు. అయితే ఈవిషయాలను టాప్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే దర్శకులు పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వంశీ పైడిపల్లి మహేష్ తో తీస్తున్న ‘మహర్షి’ కి ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ మన ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్ పూణే లతో పాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాలతో పాటు అబుదాబిలో కూడ చిత్రీకరించారు. ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీకి సంబంధించిన మరికొన్ని సీన్స్ చిత్రీకరణ కోసం యూరప్ వెళ్ళే ఆలోచనలు కూడ చేస్తున్నట్లు టాక్.

దీనితో కేవలం ఒక్క సినిమా కోసం ఇన్ని ప్రయాణాలు చేస్తూ డబ్బు విపరీతంగా ఖర్చు అవుతున్న నేపధ్యంలో ‘మహర్షి’ ఖర్చులను చూసి మహేష్ కలవరపడుతున్నట్లు టాక్. దీనితో ఖర్చులు తగ్గించమని మహేష్ వంశీ పైడిపల్లికి సంకేతాలు ఇస్తున్నా అతడు పట్టించుకోకపోవడంతో ‘మహర్షి’ సక్సస్ అయినా పెరిగిన ఖర్చులు వల్ల లాభాలు తగ్గి అది తనకు బ్యాడ్ ఇమేజ్ ని తెప్పిస్తుందని మహేష్ ఆవేదన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: