బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి గత రెండు సంవత్సరాల నుంచి వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి.  కానీ ఆయనకు ఉన్న క్రేజ్ తో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.  తాజాగా  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న ‘భారత్’టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని అతుల్ అగ్నిహోత్రి, అల్విర ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ అండ్ కృష్ణ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గతంలో  అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ కాంబినేషన్ లో సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాలు వచ్చాయి.
Related image
ఇక చిత్ర విషయానికి వస్తే..ఇండియా, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌లో కథ జరుగుతుందని అర్థం అవుతుంది. సల్మాన్ చేసిన బైక్ స్టంట్ బాగుంది. విశాల్-శేఖర్ ఆర్ఆర్, మార్కిన్ కెమెరా వర్క్ కూడా బాగుంది.  ఎప్పటిలానే తన స్టైల్ యాక్టింగ్‌తో అలరించాడు.  తన తండ్రి తనకి భారత్ అనే పేరు ఎందుకు పెట్టాడో వాయిస్ ఓవర్ ద్వారా చెప్తూ, సల్మాన్ తనని తను ఆడియన్స్‌‌కి ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో మొదలైన భారత్ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 

2019 ఈద్ కానుకగా భారత్ రిలీజ్ కానుంది. టబు, జాకీ ష్రాఫ్, దిశా పటానీ, సోనాలీ కులకర్ణి, సునీల్ గ్రోవర్, నోరా ఫతేహి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ : టీ సిరీస్, గుల్షన్ కుమార్, నిర్మాణం : సల్మాన్ ఖాన్ ఫిలింస్ అండ్ రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి.        


మరింత సమాచారం తెలుసుకోండి: