మహేష్ బాబు ఇప్పుడు డైరెక్టర్స్ కు పెడుతున్న షరతులు చూసి దర్శకులు జుట్టు పీక్కుంటున్నారు. డైరెక్టర్స్ ఒక స్టోరీ లైన్ చెప్పి మహేష్ లాంటి హీరో ను ఒప్పించడం ఇప్పడూ కష్టం అయిపోతుంది. కొరటాల శివ రూపొందించిన `భరత్ అనే నేను` తరువాత ఎక్కువ బ్రేక్ తీసుకోని మహేష్ వెంటనే వంశీ పైడిపల్లి చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. `మహార్షి` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ దిల్ రాజు ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Image result for mahesh babu

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోల్లాచ్చీలో జరుగుతోంది. ఈ సినిమా తరువాత వరుసగా చిత్రాలు చేయాలని డిసైడ్ అయిన మహేష్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు కథలు వినే వెసులుబాటు కల్పించాడు. ఇప్పటి వరకు తను ఎంపిక చేసుకున్న యంగ్ డైరెక్టర్ లు చెప్పిన కథలు విన్న మహేష్ ఏ దర్శకుడికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు తెలుస్తోంది. అనుభవం బ్లాక్ బస్టర్ హిట్ లు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ వున్న సుకుమార్ నే స్క్రిప్ట్ విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్న ప్రిన్స్ ఎంత టాలెండెడ్ డైరెక్టర్ అయినా బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే ఛాన్స్ అంటూ శరతులు విధిస్తున్నాడట.

Image result for mahesh babu

బౌండ్ స్క్రిప్ట్ లేకపోతే తన దగ్గర మీ పప్పులు ఉడకవని ఖచ్చితంగా చెబుతున్నాడట. సుకుమార్ ఇప్పటి వరకు ఎన్ని కథలు చెప్పినా ఓకే చెప్పని మహేష్ బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చిన తరువాతే ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తో  సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కొత్త కథతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర కథని ఒక లైన్ గా చెప్పినా ఒప్పుకోని మహేష్ ఇటీవల బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చి సుకుమార్ వినిపించడంతో ఓకే చెప్పేశాడని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: