ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో బాలకృష్ణ అండ్ టీం ఎన్.టి.ఆర్ మహానాయకుడు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథానాయకుడు సినిమా ఎవరికి తెలియని కథ అంటే ఎన్.టి.ఆర్ సినిమాల్లోకి ఎలా వచ్చాడు.. ఎలా నిలబడ్డాడు అన్నది మొదటి పార్ట్ లో చూపించారు.


అయితే రాబోతున్న మహానాయకుడు సినిమా అందరికి తెలిసిన కథ. ఎన్.టి.ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి జరిగిన విషయాలన్ని దాదాపు అందరికి తెలిసినవే.. ఆ కథతో వస్తున్న మహానాయకుడు సినిమా ఎలా ఉండబోతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కథానాయకుడు టాక్ బాగున్నా వసూళ్లు రాలేదు.


మహానాయకుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. ముందు ఫిబ్రవరి 7న రిలీజ్ అనుకున్నా అది కాస్త ఫిబ్రవరి 14కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ డేట్ న కూడా రావడం కష్టమే అంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్.టి.ఆర్ మహానాయకుడు పోస్టర్స్ వదిలారు వాటిలో రిలీజ్ డేట్ మిస్సైంది.


అంటే బాలకృష్ణ ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఓ పక్క ఫిబ్రవరి 8న వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమా వస్తుంది. ఆ సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించారు. ఒకవేళ యాత్ర సినిమా హిట్ అయితే ఎన్.టి.ఆర్ మహానాయకుడు మీద మరింత భారీ పడినట్టే లెక్క.



మరింత సమాచారం తెలుసుకోండి: