టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో ఎవరూ హీరోలుగా సెటిల్ మాత్రం కాలేకపోయారు. ఆ తర్వాత తమ కామెడీనే నమ్ముకుంటూ కెరీర్ కొనసాగించారు. అలాంటి వారిలో బ్రహ్మానందం, ఆలి, సునీల్ లాంటి వారు హీరోలుగా నటించి తర్వాత కమెడియన్లు గా కంటిన్యూ అయ్యారు. ప్రస్తుతం కమెడియన్లుగా నటించి హీరోలుగా రాణిస్తున్న వారు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్. ప్రేమకథాచిత్రమ్ తో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న సప్తగిరి తర్వాత ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’మంచి విజయం అందుకున్నాడు.
సప్తగిరి, వైభవీ జోషీ జంటగా అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వజ్ర కవచధర గోవింద’. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. తని పేరు గోవింద. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు సప్తగిరి.
దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. ‘నా దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న ‘వజ్ర కవచధర గోవింద’ అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. ఈ సినిమా అకున్నదానికన్నా చాలా బాగా వస్తుందని అన్నారు. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో, ఆ అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి వ్యావహారిక శైలికి పర్ఫెక్ట్గా సూటయ్యే కథ ఇది.
మా కథకు అనుగుణంగానే పవర్ఫుల్గా ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్ పెట్టాం. మా నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు అన్నారు. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. 80 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను కర్ణాటకలోని ఒక గుడిలో తెరకెక్కిస్తాం అని నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి అన్నారు. ఈ సినిమాకి కథ: జిటిఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు.