తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున వారసుడిగా ‘అఖిల్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. వివివినాయక్ దర్శకత్వం వహించిన ‘అఖిల్’ చిత్రం కమర్షియల్ గా హిట్ కాకున్నా అఖిల్ డ్యాన్స్, యాక్షన్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో చిత్రంలో నటించాడు. ఈ చిత్రం కూడా కమర్షియల్ హిట్ కాలేక పోయింది. ఈ రెండు చిత్రాల ఫ్లాప్ తర్వాత మూడో చిత్రంగా ‘మిస్టర్ మజ్ను’లో నటించాడు అఖిల్. వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మిస్టర్ మజ్ను’ ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ కేక్ కట్ చేసి .. సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్బంగా హీరో అఖిల్ మాట్లాడుతూ..హైదరాబాద్ 'దేవీ' థియేటర్లో ఆడియన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని చూశానని..థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని అన్నారు.
ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి స్పందన వచ్చిందని.. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి, తమన్ ప్రాణం పోశారని అన్నారు. ఈ చిత్రం మంచి హిట్ కావాలని పట్టుదలతో అందరం ఎంతో కష్టపడ్డాం .. ఏడెనిమిది నెలలపాటు మేము పడిన కష్టానికి తగిన ఫలితం లభించినందుకు సంతోషంగా వుంది అని అన్నాడు.