తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్ బాలీవుడ్ లో కంగనా రౌనత్ ముఖ్య పాత్రలో ‘మణికర్ణిక’చిత్రానికి దర్శకత్వం వహించారు.  కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.  ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు హీరోయిన్ కంగనా రౌనత్ తీసుకున్నారు.  ఎన్నో అవాంతరాలు..ఆరోపణలు..అభ్యంతరాల మద్య రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం దుమ్మురేపుతుంది. 
Image result for manikarnika poster hd
ఈ చిత్రం విజయాన్ని ‘మణికర్ణిక’చిత్ర యూనిట్ ముఖ్యంగా నటి, దర్శకురాలు కంగనా రౌనత్ ఎంతో సంతోషంలో ఉన్నారు.  తాజాగా 'మణికర్ణిక' చిత్రానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ ను కంగనా రనౌత్ తీసుకుంటోందని దర్శకుడు క్రిష్ చేసిన వ్యాఖ్యలపై ఆమె సోదరి రంగోలి చందేల్ స్పందించింది.  మణికర్ణిక చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించినా..మద్యలోనే డ్రాప్ కావడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.  ఆ సమయంలో ఎంతో ధైర్యం చేసి దర్శకత్వ బాధ్యతలను కూడా కంగనానే చేపట్టి చిత్రాన్ని పూర్తి చేసింది.

రంగోలి చందేల్   'ఈ చిత్రానికి మీరే దర్శకత్వం వహించారని ఒప్పుకుంటున్నా. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కంగానాదే. ఆమెను ఒంటరిగా వదిలేయండి. ఈ చిత్ర విజయాన్ని ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి.' అంటూ ట్వీట్ చేశారు. కాగా,   ఈ మద్య పలు ఇంటర్వ్యూలలో క్రిష్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వితీయ భాగంలో ఎక్కువ భాగాన్ని తానే తెరకెక్కించానని చెప్పారు. తొలి భాగంలో 20 నుంచి 25 శాతం వరకు కంగనా దర్శకత్వం వహించిందని, రెండో భాగంలో కేవలం 10 శాతం మాత్రమే చిత్రీకరించిందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: