వరస పరాజయాలు పలకరించడంతో రాజ్ తరుణ్ తో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు కరువైపోయారు. దీనితో ఈ యంగ్ హీరో కెరియర్ ముగిసిపోయినట్లేనా అన్న అనుమానాలు కూడ వ్యక్తం అయ్యాయి. దీనికితోడు ఇతడి వెనుక గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకపోవడంతో ఇతడి గురించి కథలు ఆలోచించే దర్శకులు రచయితలు కరువయ్యారు. ఇలాంటి పరిస్థుతులలో ఊహించని అదృష్టం రాజ్ తరుణ్ కు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ వల్ల కలిగింది అన్న వార్తలు వస్తున్నాయి. 

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మహేష్ మేనల్లుడు అశోక్ తో గతసంవత్సరం ఒక సినిమాను ప్రారంభించారు. ఈసినిమా ప్రారంభోత్సవం చాలా ఘనంగా కూడ జరిగింది. అయితే అనూహ్యంగా ఈసినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. దీనితో రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అనూహ్యంగా దిల్ రాజ్ మహేష్ మేనల్లుడుతో తీయాలని అనుకున్న మూవీ ఇప్పుడు రాజ్ తరుణ్ తో పట్టాలు ఎక్కబోతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పుడు ఈసినిమా  కృష్ణారెడ్డి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా  'ఆడు మగాడ్రా బుజ్జీ' అనే సినిమా నిర్మాణం జరుపుకుంది. ఈసినిమా పెద్దగా హిట్ కాకపోయినా హిట్స్ లేని రాజ్ తరుణ్ తన మొదటి సినిమాతో హిట్ అందుకోలేకపోయిన దర్శకుడు కృష్ణారెడ్డి లను కలిపి దిల్ రాజ్ ఈసినిమాను తీస్తూ ఉండటంతో మహేష్ మేనల్లుడు కోసం రెడీ పెట్టిన కథ పై దిల్ రాజ్ కు అంత నమ్మకం ఉందా అన్న ప్రచారం జరుగుతోంది. 

ఏది ఏమైనా అవకాశాలు లేని రాజ్ తరుణ్ కు మహేష్ మేనల్లుడు అదృష్టంగా మారడం యాధృశ్చికం అనుకోవాలి. ఇది ఇలా ఉంటే రాజ్ తరుణ్  యంగ్ డైరెక్టర్ వేణు తయారు చేసిన 'తుగ్లక్' అనే పొలిటికల్ సెటైర్ కథను ఇష్టపడుతూ ఆకథను సినిమాగా తీసే నిర్మాత కోసం అన్వేషిస్తున్నట్లు టాక్. అయితే పొలిటికల్ సెటైర్ కథలు రాజ్ తరుణ్ కు నప్పుతాయా అన్న సందేహాలు చాలామందికి ఉండటంతో రాజ్ తరుణ్ ఎంత ప్రయత్నించినా ఈసినిమాకు నిర్మాత దొరకడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: