టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  వాస్తవానికి వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్’సినిమాలో నటించినా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు.  ఈ సినిమాకు ముందే ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా రిలీజ్ కావడం ఘనవిజయం సాధించడం జరిగింది.  మొదటి సినిమాతోనే మెగా పవర్ ఏంటో చూపించాడు సాయిధరమ్ తేజ్. డ్యాన్స్, వైట్స్, యాక్షన్ అన్ని విషయాల్లో మెగా ఫ్యాన్స్ ని మెప్పించాడు. 

ఈ సినిమా తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేలు, సుప్రీమ్ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.  గత కొంత కాలంగా సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు ఏ ఒక్కటీ సక్సెస్ కావడం లేదు.  ఇప్పటికే ఆరు సినిమాలు డిజాస్టర్ కావడంతో కెరీర్ పరంగా అయోమయంలో పడ్డాడు. కాకపోతే..హిట్స్ లేకపోయినా ఈ హీరో క్రేజ్ అయితే తగ్గలేదు.  ప్రస్తుతం ‘చిత్రలహరి’సినిమాలో నటిస్తున్నాడు సాయిధరమ్ తేజ్.  సాధారణంగా మెగా హీరోలు అంటే ఫ్యాన్స్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది. 

సాయిధరమ్ తేజ్ మొదటి నుంచి ఫ్యాన్స్ కి ఎంతో గౌరవం ఇస్తూ..వారి మనసు నొప్పించకుండా వస్తున్నారు. ఫ్యాన్స్ ని ప్రేమించడంలో చిన్న మామయ్య పవన్ ని గుర్తు చేస్తున్నట్లు రుజువు చేశాడు. ఒక సెల్ఫీ అడిగితే వచ్చిన అభిమానులకు ఏకంగా బోజనమే పెట్టించాడు.  ప్రస్తుతం తేజు నటిస్తున్న ‘చిత్రలహరి’ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది.

అయితే అక్కడకు కొందరు అభిమానులు సాయిధరమ్ ని  కలిసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సాయి ధరమ్ షూటింగ్‌ను ఆపేసి వెళ్లి అభిమానులను కలిసి.. వారితో సెల్ఫీలు దిగి తర్వాత భోజనం పెట్టించి మరీ పంపించాడు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: