ప్రముఖ గాయకుడు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు మాట్లాడినా సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి బాలు తన రూట్ మార్చి ఇప్పడు హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. తిరుపతిలో జరిగిన హరికథ ఉత్సవంలో బాలు ఈ కామెంట్స్ చేసాడు. 
మర్డర్లు చేసేవారే పాలిటిక్స్‌లో
తెలుగు సంస్కృతిలో అంతర్భాగామైన హరికధను జనం మాత్రంమే కాకుండా ప్రభుత్వాలు కూడ మరిపోయాని పేర్కుంటూ కనీసం ఛానల్స్ లో కూడ హరికధ కార్యక్రమాలకు చోటు లేకపోవడం దౌర్భాగ్యం అంటూ సంచాలన  వ్యాఖ్యలు చేసాడు బాలు. ఇదే సందర్భంలో సినిమాల పట్ల మాత్రమే కాకుండా సినిమా ఫంక్షన్స్ పట్ల కూడ జనానికి పెరిగిపోతున్న మ్యానియా గురించి మాతలుడుతూ ఏదైనా కార్యక్రమం జరిగితే వేదిక మీదకు వచ్చే హీరోయిన్లను చూస్తే ఒళ్లు మండిపోతుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  
బాత్రూంలో చేసే పనులను
పొట్టి దుస్తులు వేసుకుంటే తప్ప నిర్మాతలు దర్శకులు ఛాన్స్‌ లు ఇవ్వరని హీరోయిన్స్ అభిప్రపడుతున్నారా అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు బాల సుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోయిన్లకే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారుఅంటూ వారి అంగాంగ ప్రదర్శన చూసి హీరోలు నిర్మాతలు వారికి ఛాన్స్ లు ఇస్తున్నారు అన్నఅబిప్రాయం వ్యక్తం చేస్తూ ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి తానూ భయపడను అని అనడమే కాకుండా తన మాటల వల్ల ఏ హీరోయిన్‌ కు కోపం వచ్చినా తానూ భయపడను అన్న అభిప్రాయం వ్యక్త పరిచాడు. 
వాళ్లకే నిర్మాత ఆఫర్లు
భాష పై అభిమానం లేని తెలుగు ప్రజలను చూస్తే జాలి వేస్తోందని ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న తెలుగు భాష పదాలను వింటూ ఉంటే తన ప్రాణం పోతోంది అంటూ ఆవేదన వ్యక్త పరిచాడు. బాత్రూంలో చేసే పనులు సినిమాలలో చూపెడుతూ యూత్ ను పాడుచేస్తున్న సినిమాల గురించి ఎవరు పట్టించుకోరని జైలు శిక్షలు పడినవారు నేరాలు చేసిన వారు రాజకీయ నాయకులు అయిపోతున్న రోజులలో ఎవరైతే ధైర్యంగా జైలుకు వెళ్లి రాగాలుగుతారో వారికే జైజైలు కొడుతున్న జనం మారనంత వరకు ఈ వ్యవస్థ మారదు అంటూ ఆవేదన వ్యక్త పరుస్తున్న బాలు అభిప్రాయాలు వినడానికి బాగున్నా పట్టించుకునే వారు ఎవరు అన్న విషయం బాలసుబ్రహ్మణ్యం గారికి కూడ తెలిసిన నిజం..   



మరింత సమాచారం తెలుసుకోండి: