టాలీవుడ్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఇప్పటికే మొదటి భాగం అయిన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.  ఇక రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు దృశ్యరూపంగా మహి వీ రాఘవ తీస్తున్న సినిమా ‘యాత్ర’. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.   

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాద యాత్ర ప్రజల్లో ఎంత రెస్పాన్స్ వచ్చిందో..ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన గొప్ప పథకాలు  ఈ సినిమాలో చూపించబోతున్నారట.  ఈ సినిమా వచ్చే నెల 8న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమాలో  వైఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు, ఆయన తనయుడు వైఎస్ జగన్ పాత్రలను ఎవరు పోషించారన్న సందేహాలు అభిమానుల్లో ఉన్న వేళ, దర్శకుడు మహి క్లారిటీ ఇచ్చారు.
Image result for yatra movie
ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు ఉండవని  తాను కేవలం వైఎస్ గురించి చెప్పేందుకే సినిమాను తీశానని, ఇతరులను తక్కువ చేయాలని భావించలేదని ఆయన అన్నారు. జగన్ పాత్ర కూడా సినిమాలో ఉండబోదని, రెండు, మూడు నిమిషాల కోసం ఓ పాత్రను ప్రవేశపెట్టి, అభిమానులను అయోమయంలో పడేయడం తనకు ఇష్టం లేదని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: