బాలీవుడ్ లో ఎంతో సాంప్రదాయంగా చీరకట్టుతో కనిపించే నటి విద్యాబాలన్. కెరీర్ బిగినింగ్ లో ‘డర్టీ పిక్చర్’ చిత్రంతో బోల్డ్ క్యారెక్టర్లో నటించి సింగిల్ హ్యాండ్తో షేక్ చేసిన విద్యాబాలన్.. తరువాత కాస్త గ్లామర్ డోస్ తగ్గించింది. ఇటీవల క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించింది.
తాజాగా విద్యాబాలన్ ఘాటైన అందాల ప్రదర్శన చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పెళ్లైనా.. 40 ఏళ్లు దాటినా.. తనలోని గ్లామర్ హంగులకు ఏమాత్రం కొదువ లేదని ఒక్క పిక్తో క్లారిటీ ఇచ్చేసింది విద్యాబాలన్. విద్యాబాలన్ తాజాగా డాబు రత్నాన్ని రూపొందించిన 2019 క్యాలెండర్ కోసం ఎద అందాలను బయట పెట్టేసి తన దమ్ము ఏంటో నిరూపించింది.
బ్లాక్ డ్రస్లో క్లోవేజ్ షో చేస్తూ.. మత్తెక్కించే కళ్లతో కుర్రకారు మైకం కమ్మేలా మిర్రర్ ముందు నిలబడి అందాలను తనివితీరా ఆస్వాదిస్తుంది. డర్టీ పిక్చర్ తో సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పుడు ఇలా ఎద అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.