రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ గాయని శివానీ భాటియ(24)దుర్మరణం చెందారు.   . ఆగ్రా లో ఓ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన భర్త నిఖిల్ తో కలిసి ప్రయాణిస్తున్నారు. మధుర జిల్లాలో యమునా ఎక్స్ ప్రెస్ హైవే దగ్గర శివానీ భర్త ఓ కారును ఓవర్ టేక్ చేయబోయాడు..ఈ క్రమంలో వీరి కారు అదుపు తప్పి బోల్తా పడింది.  అయితే శివాని భాటియా  కూర్చున్న భాగం వైపు ఎక్కువగా డ్యామేజ్ కావడంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. 
Image result for శివానీ భాటియా
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే శివానీ, నిఖిల్ లను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుండి మధురలోని నియాస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.చికిత్స పొందుతూ నిన్న చనిపోయిందని పోలీస్ ఉన్నతాధికారి ప్రకటించాడు .

శివాని భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి సింగర్ గా పేరు తెచ్చుకొని మంచి వృద్దిలోకి వస్తున్న. శివాని భాటియా చనిపోయిందన్న విషయం బాలీవుడ్ లో తెలియడంతో పలువురు షాక్ అయ్యారు . శివాని మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: