టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘మల్లీశ్వరి’సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పరిచయం అయ్యింది.  ఆ సినిమా తర్వాత కత్రినా తెలుగు లో ఏ సినిమాలోనూ నటించలేదు.  ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా పూర్తయిన తర్వాత క్రియేటీవ్ దర్శకులు సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలిసిందే.  ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. 
Image result for nenokkadine
ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంద‌ని టాక్.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేనొక్కిడినే సినిమా వచ్చింది.  కథాపరంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినా..అభిమానులు మాత్రం రిసీవ్ చేసుకోలేకపోయారు.  అయితే సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమా లో పలువురు హీరోయిన్ల పేరు వినిపించినా..బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ని ఫైనల్ చేస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. 
Related image
తాజాగా ఈ విషయంపై స్పందించిన కత్రినా ప్రస్తుతం తాను సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘భారత్’సినిమాలో నటిస్తున్నానని..త‌న త‌దుప‌రి చిత్రం ఏంట‌నేది ఇంకా క‌న్‌ఫాం కాలేద‌ని తెలిపింది. మ‌హేష్ సినిమాకి సంబంధించిన చిత్ర యూనిట్ న‌న్నెవ‌రు సంప్ర‌దించ‌లేదని క్లారిటీ ఇచ్చింది. మహేష్ 26వ సినిమాలో న‌టిస్తున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదు అని క‌త్రినా మీడియాతో తెలిపారు. ఈ సినిమా మైత్రి మూవీ మేక‌ర్స్ రూపొందించ‌నున్నారు.  ఈ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్న విష‌యం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: