టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ ఐకాన్ గా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉంది. పెళ్లచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీ వాలా ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న ఈ యువ హీరో నిర్మతగా మారుతున్న విషయం తెలిసిందే. గతంలో పెళ్లిచూపులు సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా కథ నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరగనున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ నాలుగు ప్రధాన పాత్రల్లో యాంకర్ అనసూయ కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరో గా తరుణ్ భాస్కర్, హీరోయిన్ గా యాంకర్ అనసూయ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది యాంకర్ అనసూయ. ఈ సినిమాలు నాలుగు ప్రధాన పాత్రలు ఉండబోతున్నాయని...ఈ సినిమాలో నేను చేసేది రొమాంటిక్ పాత్ర కాదని నటనకు మంచి గుర్తింపు వచ్చే పాత్రలో నటిస్తున్నాని అంటుంది.
ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ.. రంగమ్మత్తగా మంచి నటన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనసూయకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో వచ్చే సినిమాలో తన పాత్రకి చాలా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉందని... మిగతా వివరాలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాక చెబుతాను అని అంటుంది అనసూయ. త్వరలో ఈ సినిమాకు సంబంధించి న పూర్తి వివరాలు అధికార ప్రకటన చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.