రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో అనుసరిస్తున్న ఒక సరికొత్త వ్యూహం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీకి కనీసం 600 కోట్ల బిజినెస్ చేయాలని రాజమౌళి ఒక టార్గెట్ ను పెట్టుకున్నాడు.

ఇలాంటి టార్గెట్ అందుకోవాలి అంటే బాలీవుడ్ మార్కెట్ లో ఈమూవీకి చాల భారీ బిజినెస్ జరగాలి. దీనికోసం ఇప్పటి వరకు రాజమౌళి ఆలోచనలు ఒక బాలీవుడ్ హీరోయిన్ చుట్టూ తిరిగాయి. అయితే కేవలం ఒక క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ కు బాలీవుడ్ లో క్రేజ్ రాదని గ్రహించిన రాజమౌళి ఈమూవీ కథలో మరొక హీరో పాత్ర క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం.

ఈమూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో స్వాతంత్రోద్యమ స్పూర్తితో చరణ్ జూనియర్ లకు దిశా నిర్దేశ్యం చేసే ప్రత్యేక పాత్రలో ఈ మూడవ హీరో ప్రత్యేక పాత్ర ఉంటుందని టాక్. ఈపాత్ర రూపకల్పన కోసం ఇప్పటికే రాజమౌళి తనతండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు అతిథి పాత్రగా వచ్చే ఈమూడవ హీరో పాత్రలో నటించమని రాజమౌళి ఇప్పటికే ప్రభాస్ ను అడిగినట్లు టాక్. కేవలం జూనియర్ చరణ్ ల స్టామినాతో ‘ఆర్ ఆర్ ఆర్’ కు బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడదు అన్న విషయం గ్రహించిన రాజమౌళి ప్రభాస్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో కొనసాగుతున్న క్రేజ్ ను ‘ఆర్ ఆర్ ఆర్’ వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నాడనుకోవాలి. ఈవిషయమై అధికారిక సమాచారం త్వరలో వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: