ఎలాంటి సంగీత నేపథ్యం, శిక్షణ లేకపోయినా తన పాటలతో ఉర్రూతలూగిస్తోన్న గాయని పసల బేబీ. ప్రస్తుతం ఈమె గాత్రాన్ని విన్న వారు మట్టిలో మాణిక్యం అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇటీవల గాన గంధర్వులు బాల సుబ్రమాణ్యం సైతం బేబి పాట విని ముగ్దుడు అయ్యారు..ఇలాంటి గొంత ఆమెకు ఉండటం పూర్వ జన్మ సుకృతం అన్నారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ..పసల బేబీ ప్రత్యేకం ఇంటికి పిలిపించుకొని మరి తన పాట విని ప్రశంసించారు. ఇలా బుల్లితెరపై తన గాత్రంతో ముగ్దులను చేస్తున్న పసల బేబీ కి తొలిసారిగా మూవీలో పాడే అవకాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు రఘు కుంచె, "జీవితంలో గరళాన్ని మింగి.. తన గొంతులోని అమృతాన్ని మన చెవుల్లో పోసిన ఒక పల్లె కోయిల పాట..." అని సాగే పాటను ఆమెతో పాడించి, యూట్యూబ్ లో ఉంచడంతో అదిప్పుడు దూసుకుపోయింది.
'పలాస 1978' చిత్రంలో పసల బేబీ పాడబోతుంది. ఇటీవల దుబాయ్, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించిన వచ్చిన బేబీ, మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకోగా, ఆ వెంటనే రఘు కుంచె ఈ పాటను రికార్డ్ చేశారట. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.