తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ అక్కినేని ‘అఖిల్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి చిత్రం స్టార్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో వచ్చినప్పటికీ అఖిల్ కి మాత్రం సక్సెస్ కలిసి రాలేదు.  డ్యాన్స్, ఫైట్స్, నటన పరంగా మంచి మార్కులు కొట్టినా..ఆ చిత్రం మాత్రం కమర్షియల్ గా హిట్ కాలేక పోయింది.  ఆ తర్వాత మరో స్టార్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ చిత్రం కూడా కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. 
Image result for nagarjuna akhil
ఈ మద్య వెంకి అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’చిత్రంతో మూడోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ నటన పరంగా బాగానే ఆకట్టుకున్నా..చిత్రం మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. అఖిల్ తన ప్రతి సినిమా విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. అయినా ఇంతవరకూ ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది.  ఈ నేపథ్యంలో తన నాల్గవ చిత్రానికి శ్రీను వైట్ల, ‘మలుపు’ దర్శకుడు సత్య తో ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
Image result for akhil majnu
తాజా సమాచారం ప్రకారం ఈసారి క్రిష్ పేరు వినిపిస్తుంది.  ఆ మద్య అక్కినేని నాగార్జునను క్రిష్ కలిసి ఓ కథ వినిపించారట..ఆ కథ నాగ్ కి ఎంతో బాగా నచ్చినట్లు సమాచారం. దాంతో క్రిష్ తో తన సొంత బ్యానర్లో ఆ చిత్రం చేయడానికి నాగార్జున ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. అంతే కాదు ఈ చిత్ర నిర్మాణంలో క్రిష్ కూడా ఒక భాగస్వామి కానున్నాడని చెబుతున్నారు. 'మహానాయకుడు' రిలీజ్ తరువాత క్రిష్ .. అఖిల్ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెడతాడని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: