మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151 సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ రూపొందుతున్న విషయం తెలిసిందే.  సినీ పరిశ్రమకు పది సంవత్సరాలుగా విరామం తీసుకున్న చిరంజీవి గతంలో తనకు ఠాగూర్ లాంటి హిట్ ఇచ్చిన వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా మెగాస్టార్ కి 150వ సినిమా కావడం మరో విశేషం. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కమర్షియల్ సినిమా కాకుండా తెలుగు నాట మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు. 
Image result for seaira narasimha reddy
ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా..మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా ఉన్నారు.  చిరంజీవి సరసన నయనతార, తమన్నాలు హీరోయిన్లు గా నటిస్తున్నారు.  మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అబితాబచ్చన్ నటిస్తున్నారు.  వాస్తవానికి ఈ సినిమా ఈ యేడాది సంక్రాంతి బరిలో నిలపాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వీలు కాలేదు..ఆ తర్వాత వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని చూసినా..సినిమా మరింత పర్ఫెక్ట్ గా ఉండాలని కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం.
Image result for seaira narasimha reddy
ఈ సినిమా ఇప్పుడు దసరా బరిలో నిలిచింది.  ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా ప్రేక్షకులకు అందించాలని నిర్మాత రాంచరణ్ గట్టి పట్టుమీదే ఉన్నారట. దానికి తగ్గట్టుగానే చిత్రీకరణని  వేగవంతం చేశారు.  ఈ సినిమాలో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలని తెరకెక్కించేశారు. జగపతిబాబు, విజయ్‌సేతుపతి కీలక పాత్రల్లో కనిపిస్తారు.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: