టాలీవుడ్లో ఇపుడు మరో హాట్ బ్యూటీ హల్ చల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఆమె ఓ టాప్ హీరో పక్కన జోడీ కడుతోంది. ఈ రేర్ కాంబోతో మూవీ తొందరలో సెట్స్ మీదకు రానుంది.
పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నాగార్జున మన్మధుడి సీక్వెల్ లో నాగ్ కి జోడీగా తీసుకుంటున్నారు. పాయల్ తన అందచందాలతో ఇప్పటికీ ఆర్ ఎక్స్ 100 మూవీలో స్టామినా చాటుకుంది. ఇపుడు ఈ అమ్మడుకు ఏకంగా రొమాంటిక్ కింగ్ నాగ్ పక్కన చాన్స్ రావడం అంటే లక్ కలసివచ్చినట్లే. ఈ మూవీకి చి.ల.సౌ మూవీతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్ కి డైరెక్టర్.. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని తీసుకున్నారు..
మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.. ఇక పాయల్ మాస్ మహారాజ రవితేజతో కూడా ఒక మూవీ చేస్తున్నది.. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీలో ఐటెం సాంగ్ ను ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తానికి చూసుకుంటే పాయల్ తన ఒంపు సొంపులతో టాలీవుడ్ మన్మధున్ని గిలిగింతలు పెడుతూనే యూత్ కి కూడా కిర్రాకు పుట్టిస్తుందన్న మాట. ఈ వరస ఆఫర్లతో ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.