టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్.  కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు..ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’సినిమాతో రకూల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా సక్సెస్ తర్వాత రకూల్ వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది.  ఒకదశలో టాలీవుడ్ యంగ్ హీరోలు రకూల్ తమ జోడి అయితే బాగుంటుందనే సలహా ఇచ్చిన రజులు కూడా ఉన్నాయని సమాచారం. 

హిట్టూ..ఫ్లాపు అనేది లేకుండా తెలుగు, తమిళ భాషల్లో వరుస ఛాన్సులు కొట్టేసిన ఆ బ్యూటీ ఆ మద్య బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.   హీరోయిన్ గా మంచి పోజీషన్లో ఉన్న రకూల్ కొన్ని కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంది.  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రకూల్ కి తెలుగులో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. 2017లో వచ్చిన 'స్పైడర్' సినిమా తరువాత రకుల్ మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. అప్పటివరకు టాప్ రేసులో దూసుకుపోయిన ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పడిపోయింది. 

ప్రస్తుతం తెలుగులో కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోయింది.  ఈ మద్య క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’సినిమాలో ఒక్క పాటపై మెరిసింది.  తెలుగు లో నటించకున్నా ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో నటిస్తుంది రకూల్.  అయితే కార్తి సరసన ‘దేవ్’సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

గతంలో కార్తితో కలిసి 'ఖాకీ' అనే సినిమాలో నటించింది రకుల్ ఇప్పుడు 'దేవ్' సినిమాపైనే రకుల్ ఆశలన్నీ పెట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రం బృందం.  ఇక ట్రైలర్ లో రకూత్ కాస్త గ్లామర్ షో ఎక్కువే చేసినట్లు కనిపిస్తుంది.  ఏది ఏమైనా ‘దేవ్’మంచి సక్సెస్ కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది రకూల్. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: