నటి హేమ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వివరిస్తూ మాటల మధ్యలో తన 300 కోట్ల ఆస్థి పై ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న యాంకర్ సినిమాలలో కమెడియన్ పాత్రలు చేసే హేమకు బీఎండబ్ల్యూ కార్లు అనేక ప్లాట్లు ఎలా వచ్చాయి అని అడిగిన ప్రశ్నకు ఎవరూ ఊహించని ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 
పూరి జగన్నాథ్‌కు అప్పు ఇచ్చేదాన్ని
తనకు చాలామంది 300 కోట్ల వరకు ఆస్థి ఉందని అనుకుంటున్నారని వాస్తవానికి ఆవార్తలు ఎలా వచ్చాయో తనకు తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన తల్లి కుటుంబం బాగా ధనవంతులు అయిన నేపధ్యంలో తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒంటి నిండా బంగారు నగలతో షూటింగ్ కు వచ్చిన సందర్భాలను గుర్తుకు చేసుకుంది. 
రెమ్యునరేషన్ పెంచడం లేదు
తమకు కొన్ని వ్యాపారాలు కూడ ఉన్నాయని గతంలో పూరి జగన్నాథ్ కృష్ణవంశీలు అసిస్టెంట్ డైరెక్టర్ లుగా ఉన్నప్పుడు తాను తన భర్తకు తెలియకుండా వారికి డబ్బు అప్పుగా ఇచ్చిన సందర్భాలను గుర్తుకు చేసుకుని ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వారికి షాక్ ఇచ్చింది. ఇదే సందర్భంలో ఈమధ్య వార్తలలో వచ్చిన తన గుండు గురించి మాట్లాడుతూ తాను తిరుపతి వెళ్ళి తల నీలాలు ఇస్తే దానికి వేరే అర్ధాలు సృష్టిస్తూ కొందరు సెటైర్లు వేయడం పై హేమ తన ఆవేదన వ్యక్త పరిచింది. 
చాలా రోజుల తర్వాత
ఇదే సందర్భంలో తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతున్నాయి అన్న విషయం పై స్పందిస్తూ ప్రస్తుతం తాను డబ్బు గురించి నటించడం లేదనీ కేవలం తన పేరు తీసుకు వచ్చే పాత్రల గురించి ఆలోచిస్తున్నాను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చింది. అంతేకాదు నిన్నకాక మొన్న వచ్చిన మేల్ కమెడియన్ ఆర్టిస్టులకు పారితోషికాలు బాగా ఇస్తూ ఉంటే ఉమన్ కమెడియన్ పాత్రలను పోషించే వారికి మాత్రం పారితోషికాల విషయంలో అన్యాయం జరుగుతోంది అంటూ హేమ చేస్తున్న కామెంట్స్ నేటి ఇండస్ట్రీ పరిస్తుతులను సూచిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: