భారతీయ చలన చిత్ర రంగంలో బహుభాషా నటులు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ ఒకరు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ప్రస్తుతం తెలుగు లో వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘యాత్ర’చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల మాలీవుడ్ లో మమ్ముట్టి నటించిన పెరంబు రీసెంట్గా విడుదలైంది. ఈ చిత్రం తండ్రీ, కూతురు కి మద్య ఉన్న అనుబంధం గురించి ఎంతో చక్కగా చూపించారు. ఈ చిత్రంలో మమ్ముట్టి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
ఇక మమ్ముట్టి తనయుడు ‘మహానటి’ఫేమ్ దుల్కన్ సల్మాన్ తన తండ్రి నటన ఎంతో మెచ్చుకుంటూ తెగ పొగిడేస్తున్నాడు. ఈ చిత్రంలో తన ఆటోడ్రైవర్ అముదవన్ పాత్రలో జీవించేశారు. తండ్రి, కూతురు అనుబంధం ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించారంటూ తెగ మెచ్చుకుంటున్నాడు. పెరంబు చిత్రాన్ని ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించగా అక్కడ కూడా ఈ చిత్రానికి భారీ ఆదరణ లభించింది.
ఇలాంటి మూవీ ఆయన చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది. మూవీస్ అనేది ఆయన పాషన్. దానిని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. అభిరుచి ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకోవడం ఆయనకే చెల్లిందని మమ్ముట్టిపై దుల్కర్ ప్రశంసలు కురిపించారు.