టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్- పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో ‘అత్తారింటికి దారేది’సినిమా సూపర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాన్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కన్నడలో కిచ్చ సుదీప్ హీరోగా రిమేక్ చేశారు. తమిళ్ లో సుందర్ సీ దర్శకత్వంలో శింబు హీరోగా ‘వందా రాజాదా వరువేన్’గా రూపొందించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. సాధారణంగా తెలుగు లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తమిళ్ లో కూడా బాక్సాఫీస్ షేక్ చేస్తుందని అనుకున్నారు.
ఒరిజినల్ మూవీలో పవన్ ను చాలా స్టైలీష్ గా .. హ్యాండ్సమ్ గా చూపించాడు త్రివిక్రమ్. మాస్ ఆడియాన్స్ కి కావలసిన అంశాలను జోడిస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్ది భారీ హిట్ కొట్టాడు పవన్.అయితే తమిళ వెర్షన్ లో ఆ చిత్ర దర్శకుడు సుందర్ కేవలం శింబుపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
శింబు ఓవరాక్షన్ చేసి సినిమా ఫెయిల్యూర్ లో కీ రోల్ పోషించడాని కోలీవుడ్ ప్రేక్షకులు అంటున్నారు. సినిమాలో పెద్దగా మార్పులు లేకుండా సుందర్ సి త్రివిక్రమ్ స్టైల్ ని ఫాలో అయ్యాడు. తెలుగులో పవన్ కళ్యాన్ - త్రివిక్రమ్ టేకింగ్ కి తగ్గట్టుగా కోలీవుడ్ టీమ్ తీయలేకపోయిందని రివ్యూలు వస్తున్నాయి. ఆత్తగా నటించిన రమ్యకృష్ణ క్రేజ్ కూడా సినిమాకు ఉపయోగపడేలా లేదు. అంతే కాదు ఈ సినిమాకు దారుణమైన రివ్యూ ఇచ్చినట్లు సమాచారం.