టాలెంట్ ఎక్కడ ఉంటే దర్శక నిర్మాతల కన్ను అక్కడ ఉంటుంది. అవకాశం కోసం వెతికే వారి టాలెంట్ గుర్తించి వారికి ఛాన్సులు ఇవ్వడం ఒక రకమైతే ఆల్రెడీ తమ టాలెంట్ తో ప్రూవ్ చేసుకున్న వారి వెంట పడటం మరో రకం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.


కన్నడ నుండి వచ్చిన ఆ అమ్మడు చేస్తున్న సినిమాలన్ని మంచి ఫలితాలు ఇవ్వడంతో ఆమె మాయలో పడుతున్నారు. ఇంతకీ ఎవరా అమ్మడు అంటే ఇంకెవరు కిర్రాక్ పిల్ల రష్మిక మందన్న అనేస్తున్నారు. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది.


ఇక ఈ సినిమాల సక్సెస్ అమ్మడికి తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ముందు ఈ సినిమాలో కియరా అద్వానిని తీసుకోవాలని చూసినా ఆమె డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా లేవని రష్మికకు ఫిక్స్ అయ్యారట.


సినిమాలు ఎలా ఉన్నా తన పాత్ర వరకు పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తున్న రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఏర్పరచుకుంది. టాలీవుడ్ లో విజయ్ తో చేస్తున్న సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు చేస్తుందట. మరి త్రివిక్రం, బన్ని సినిమా కూడా కన్ఫాం అయితే అమ్మడికిక తిరుగు ఉండదని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: